33.7 C
Hyderabad
April 30, 2024 02: 38 AM
Slider ముఖ్యంశాలు

152 మంది పెట్టిన కేసులు ఎత్తివేయడం సంతోషదాయకం

#CPI

ప్రొఫెసర్‌ హరగోపాల్‌, పద్మజా షాతోసహా మరో 152 మంది పెట్టిన ఊపా కేసును ఎత్తివేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ ఉపా చట్టాన్ని దేశవ్యాపితంగా ఎత్తివేయడానికి ప్రజాతంత్ర వాదులు, ప్రజాస్వామ్యాన్ని కోరే వారు, ప్రజాతంత్ర పాలనను అందించాలనుకునే పాలకులు ఈ ఉపా చట్టాన్ని ఎత్తివేయడానికి కృషి చేయాల్సిన అవసరం వుందని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కూనంనేని కోరారు.

దేశ ద్రోహం కేసు చట్టాన్ని ఎత్తివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని అన్నారు. నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఎజెన్సీ (ఎన్‌ఐఎ) కూడా వేధింపులకు నిరుపయోగంగా ఉన్న చట్టాలను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈ సెక్షన్లు చట్టపరంగా ఎలాంటి ప్రయోజనం లేకపోగా, ప్రజాసమస్యలపై ప్రశ్నించే గొంతుకలను నొక్కివేయడానికి, వారిని భయభ్రాంతానికి గురిచేయడానికి పోలీసు యంత్రాంగం ఉపయోగిస్తున్నారని, కొన్ని కేసులు ప్రభుత్వానికి కూడా తెలియకూడా

పెడుతున్నారని అన్నారు. 1987లో నేను మండల అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సాధారణంగా ఒకపార్టీకి మరోపార్టీకి జరిగే ఘర్షణలో నాపైన కూడా ఈనాడు ఊపాగా పిలువబడే తాడా కేసు పెట్టారని, అనాడు ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చలు జరిపి తాడా సెక్షన్‌ను ఎత్తివేసిన తరువాతే బెయిల్‌ రావడం జరిగిందని అన్నారు.

నాలాంటి వారిపై కూడా టెర్రరిస్టులు కేసులు పెట్టడం వలన ఈ చట్టాన్ని ఎ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో అర్ధం అవుతుందని అన్నారు. ఇది ప్రయోజనకరంగా కాదని, వ్యవస్థకు చెడు చేసే సెక్షన్లను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు.

Related posts

దూదిమెట్ల బాలరాజు కు కొల్లాపూర్ యాదవ సంఘం అభినందనలు

Satyam NEWS

ప్రార్ధించే పెదవుల కన్నా…సాయం చేసే చేతులు మిన్న..

Satyam NEWS

బోథ్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment