టిఆర్ఎస్ పార్టీ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గ ముఖ్యనాయకులు దివంగత నేత జి.రత్నప్రభాకర్ రెడ్డి దశదినకర్మ కు ఎంపీ పోతుగంటి రాములు తో సహా టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, అభిమానులు హజరై ఘన నివాళులు అర్పించారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణం ఎస్ ఏం గార్డెన్ లో ప్రజా నాయకుడు, ఎంపీపీ గాదెల సుధారాణి భర్త కీర్తిశేషులు రత్నప్రభాకర్ రెడ్డి దశదిన కర్మ జరిగింది.
ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా రత్న ప్రభాకర్ రెడ్డి అనుచరులు వంగ రాజశేఖర్ గౌడ్, రఘుపతి, నాగేంద్ర యాదవ్ రత్నప్రభాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఎంపీ పోతుగంటి రాములు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
రత్న ప్రభాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంతకు ముందు రత్నప్రభాకర్ రెడ్డి స్వగ్రామం మాచినేని పల్లి స్వగృహంలో దశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. కుంటుంబ సభ్యులను నేతలు పరామర్శించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, సిఆర్ జగదీశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యులు మతిన్, వైస్ ఎంపీపీ భోజ్య నాయక్, సర్పంచులు, ఎంపిటిసిలు, మండల నాయకులు ముచ్చర్ల రాంచందర్ యాదవ్ శేఖర్ శెట్టి, తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్ ఎస్ ఎం గార్డెన్ లో జరిగిన నివాళి కార్యక్రమానికి రత్నప్రభాకర్ రెడ్డి అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.