29.7 C
Hyderabad
May 1, 2024 07: 21 AM
Slider గుంటూరు

ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలు

tdp nrt 15

ప్రజాస్వామ్య విలువలకు పెట్టింది పేరు అయిన తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించుకుంటున్నది. ఇందులో భాగంగా నేడు నరసరావుపేట పట్టణంలోని 28 వ వార్డులో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు ఇక్కడ జరిగాయి.

పార్టీ నియమ నిబంధనలు కు లోబడి వార్డ్ అధ్యక్షులు, వార్డ్ కమిటీ కార్యవర్గం, వార్డ్ తెలుగు రైతు, వార్డ్ తెలుగు యువత, వార్డ్ మహిళా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఆహ్వానితులుగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నిక అయిన కమిటీ సభ్యులకు అరవింద బాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలు సిద్దాంతాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పేద ప్రజలకు మేలు చేయడమనే ప్రాధమిక సిద్ధాంతానికి లోబడి పని చేయాలని ఆయన చెప్పారు.

డాక్టర్ చదలవాడ తో బాటు వల్లెపు నాగేశ్వరరావు, కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, గట్టుపల్లి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ ఎన్నికల పరిశీలకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరించే ఆలోచన విరమించుకోవాలి

Satyam NEWS

చిన్నశేషవాహనంపై శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

Satyam NEWS

పెద్దమనసు చాటుకున్న పినపాక ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment