రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కొకాపెట్ లోని తన నివాసంలో దక్షిణ భారత సినీ హీరోయిన్ కేథరీన్ ట్రెసా అలెగ్జాండర్ (సరైనోడు చిత్రం లో MLA పాత్రధారి) మొక్కలు నాటారు.
అనంతరం మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటనని కేథరిన్ ట్రెసా తెలిపింది.
అడవులు, పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఆమె తెలిపారు.
అనంతరం మరో ముగ్గురు ( సిద్ధార్థ్ , తమిళ నటులు ఆర్య, అధర్వ మురళి ) తో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనాలని ఆమె తన స్నేహితులు, అభిమానులందరినీ అభ్యర్థించింది.