40.2 C
Hyderabad
May 2, 2024 18: 35 PM
Slider ఖమ్మం

గ్రీనరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

#khammam

సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గ్రీనరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గ్రీనరీ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అగ్రిమెంటులో సూచించిన ప్రకారం గ్రీనరీ పనులు, మొక్కలు నాటడం చేయాలన్నారు. ప్లాన్ ప్రకారం ఏ ఏ మొక్కలు ఎక్కడ నాటాలో కలెక్టర్ పరిశీలించారు. గ్రీనరీకి సంబంధించి మొక్కలు చేరుకున్నట్లు ఆయన అన్నారు. నాటడం, సంరక్షణ చర్యలు చేపట్టడం చేయాలన్నారు.  భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. లిఫ్టుల ఏర్పాటు పూర్తయినట్లు ఆయన అన్నారు. మిగులు పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.    కలెక్టర్ తనిఖీ సందర్భంలో జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, ఏఇఇ విశ్వనాథ్, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

గురువు

Satyam NEWS

మృతదేహంతో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా

Satyam NEWS

పల్నాడు ప్రాంతంలో ఇక మెరుగైన వైద్య సౌకర్యాలు

Satyam NEWS

Leave a Comment