31.7 C
Hyderabad
May 2, 2024 09: 43 AM
Slider రంగారెడ్డి

మృతదేహంతో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా

#uppalatrust

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ షాక్ తో మృతి చెందిన హరిసింగ్ మృతదేహంతో కార్యాలయం ముందు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఎంపీపీ నిర్మల ధర్నా నిర్వహించారు.తలకొండపల్లి మండలం  తండాకు చెందిన గిరిజన యువకుడు బుధవారం వ్రేలాడుతున్న  విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ తో మరణించారు.

కాగా  విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఎంతో మంది ప్రాణాలు బలి గోన్నారని ప్రస్తుతం హరి సింగ్ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారని ఆయన మృతదేహంతో కుటుంబ సభ్యులతో పాటు తలకొండపల్లి ఉప్పల వెంకటేష్ ఎంపీపీ నిర్మల విద్యుత్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి అదనపు స్తంభాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో విద్యుత్ అధికారుల పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వినతి పత్రం అందజేశారు.

Related posts

చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

టిఆర్ఎస్ ని ఎదుర్కొనే దమ్ము ఒక్క బీజేపీ కి మాత్రమే వుంది

Satyam NEWS

విజయనగరం లో ఎత్తు బ్రిడ్జి వద్ద దారుణం…

Satyam NEWS

Leave a Comment