చికాగో అడుగు పెట్టిన సద్గురు శ్రీ గురూజీ
మనస్సే అన్నింటికీ మూలం..రసాన్ని కట్టేస్తే గాని స్వర్ణం సిద్ధించదని యోగి వేమన చెప్పినట్లు గానే…మనసు ను అదుపులో ఉంచుకుంటే… దేన్నైనా సాధించవచ్చన్నది భగవద్గీత సారాంశం. తాజాగా విడుదలైన “కార్తికేయ” సినిమాలో… అనుపమ్ ఖేర్… శ్రీకృష్ణుడు గురించి చెప్పిన మాటలే ఈ సోషల్ మీడియా తరం వాళ్ళ కు ఈ పాటికే అర్థమవ్వాలి. సదా ప్రాణాయామం అంటూ ఉచ్వాస..నిశ్వాసలను రాపిడి చేయడం ద్వారా అగ్ని ఉద్భవించింది.. తద్వారా శరీరంలో ప్రాణనాడులన్నీ ఏకీకృత మై..బుధ్ధి వికసించి…మానవుడు తాదాత్మ్యం పొందుతాడు.
అదే ప్రాణాయామం… ఓం కార నాదం…ప్రణవ శబ్దం. పరమగురువుల వద్ద పొందిన ఉపదేశం ద్వారా ప్రాణాయామ సాధన చేసి…ఊర్ద్వ స్థితికి చేరుకోవడమే మానవుని ముందు ఉన్ళ కర్తవ్యం. అయితే సత్సాంగత్యం…సద్గురు బోధ…సద్గ శుశ్రూషల ద్వారా నే ఆ విద్య లభిస్తుందని పురాణ ఇతి హాసాలలో పూర్వీకులు చెప్పారు. ప్రస్తుతం ఈ ఏండ్రాయిడ్ యుగంలో… ప్రతీ ఒక్క రూ తెలుసుకోవాలి.. తెలియచెప్పిలనే ఉద్దేశ్యం తో శ్రీస్వామి రామానంద యోగజ్ఞానాశ్రమం పీఠాధిపతి… వైద్య ఆరోగ్య శాఖ లో రీజనల్ డైరెక్టర్ గా పని చేసిన సద్గురు అంతర్ముఖానంద(శ్రీగురూజీ) ప్రపంచ వ్యాప్త పర్యటన చేస్తున్నారు.
నాడు మాతృభూమి కోసం వివేనాందుడు…ఏ విధంగా అయితే అమెరికాలో ని చికాగోలో అడుగు పెట్టారో…అలాగే శ్రీగురూజీ ,అమ్మ గారులిద్దరూ నాలుగు నెలల పాటు విదేశీ పర్యటన చేస్తున్నారు. సెప్టెంబర్ 16 నుంచీ డిశెంబర్ 14 వరకు విదేశాల్లో ప్రముఖ నగరాలలో యోగం…ధ్యానం.. ఉద్భోదించడమే కాక…ఉపదేశం ఇవ్వనున్నారు.తొలుత చికాగో…ఆఖరున టెక్సాస్ లో పర్యటించి…నాలుగు నెలల తర్వాత స్వదేశానికి తిరిగి రానున్నారు. శ్రీగురూజీ మొత్తం పర్యటన ను…అమెరికా లో ఉంటున్న శిష్యురాలు ఉషాభారతి..శ్రీగురూజీ ఆదేశాలతో నిర్వహిస్తున్నారు.మొత్తం నాలుగు నెలల పర్యటన లో అక్టోబర్.. డిశెంబర్ నెలలో ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు…విదేశాల్లో ఉన్న శిష్యులు.