40.2 C
Hyderabad
April 26, 2024 12: 11 PM
Slider నల్గొండ

కదం తొక్కిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీ

#saidireddy

హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం ఉదయం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీని జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఉన్న 500 పై చిలుకు సంస్థానాలలో హైదరాబాద్ ఒకటి అని,అప్పటికే ఈ రాష్ట్రానికి ప్రత్యేక కరెన్సీ, సైన్యం, ఎయిర్ పోర్ట్,విద్యుత్ కలిగిన సంస్థానం అని,తాను ఇండియాలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలియజేసిన నిజాం చివరికి భారత ప్రభుత్వానికి లొంగిపోయి భారతదేశంలో హైదరాబాద్ ని కలిపివేశరని అన్నారు.

2014 నాటికి అట్టడుగున ఉన్న తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంలా ఎదిగిందని,తెలంగాణా ప్రత్యక రాష్ట్రం కోసం జరిగిన దశల వారి ఉద్యమంలో భాగంగా మలి దశ ఉద్యమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కి మాత్రమే దక్కుతుందని అన్నారు.

ఎన్నో కుట్రలను, అవమానాలను దాటుకుని నేడు తెలంగాణ ప్రత్యేక రాష్టం తేవడం మాత్రమే కాక ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ లోని ప్రతి కుటుంబాలలో ప్రతి పౌరుడు ఏదో ఒక రకమైన సంక్షేమ పథకం ద్వారా తన యొక్క ఇబ్బందులను పోగొట్టుకొని సుఖంగా జీవించడానికి తమ జీవితాలను సుగమనం కెసిఆర్ చేశారని అన్నారు.

తెలంగాణ సమాజం మొదటి నుంచి కూడా గంగా యమున తహసీబ్ గా వర్ధిల్లుతూ కులాలు,మతాలు అని వివక్షత లేకుండా బంధుత్వంతో సోదర భావంతో తెలంగాణ సమాజం శాంతియుతంగా జీవిస్తున్న సందర్భంగా ఈ యొక్క శాంతియుత జీవనం ఇలాగే కొనసాగాలని అందులో భాగంగానే నేడు సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినంగా అభివర్ణిస్తూ జాతీయత ఉట్టిపడేలా ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని శానంపూడి సైదిరెడ్డి అన్నారు.తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోరోత్సవ ర్యాలీ ప్రారంభించి మొదటిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించి, అమరవీరులకు జోహార్లు అర్పించారు.

ఈరోజు రాష్ట్రంతో పాటుగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతూ శరవేగంగా ముందుకు దూసుకు పోతుందని,ఇప్పటికే 3500 కోట్ల రూపాయలతో నియోజకవర్గ మొత్తంలో రోడ్లు,భవనాలు,కాలువలు,వంతెనలు, రహదారులు మొదలైన మౌలిక సదుపాయాలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మినీ ట్యాంక్ బండ్,చిల్డ్రన్స్ పార్కులు,సిసి రోడ్డు,డ్రైనేజీలు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులను రూపొందించుకుంటూ ప్రతి గ్రామాన్ని ఒక అద్దంలో తయారు చేసుకుంటూ గత 25 ఏళ్లలో జరిగన అభివృద్ధిని కేవలం ఈ రెండున్నర సంవత్సరాలలో జరిపి ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడం జరిగిందని సైదిరెడ్డి అన్నారు.

ప్రతినిత్యం పుస్తకాలతో స్నేహాలు చేయాలని,పుస్తకాలు చదవాలని,మంచిని స్వీకరించాలని,సమాజంలో ఎన్నో రకాలైనటువంటి మంచి,చెడు ప్రభావాలు ప్రతినిత్యం సంఘర్షణంగా కనిపిస్తూ ఉంటాయని,అటువంటి సందర్భాలలో మంచిని మాత్రమే స్వీకరించి సమాజ అభ్యుదయానికి పాటుపడాలని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

నిర్మలాసీతారామన్ తో సీఎం జగన్ భేటీ

Satyam NEWS

హ్యడ్లుమ్, హ్యాండీ క్రాఫ్ట్ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

సీనియర్లు కలిసి రాకపోయినా ఆగని రేవంత్ పయనం

Satyam NEWS

Leave a Comment