ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి పదవికి విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి తన నామినేషన్ ను దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి అందజేశారు. నామినేషన్ ప్రక్రియలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, చీఫ్ విప్ ప్రసాదరాజు, వేల్లంపల్లి శ్రీనివాసరావు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన్న అప్పలనాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు,రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ బోర్డు చైర్మన్ గుబ్బ చంద్రశేఖర్, మారటోరియం చైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం బోర్డు సభ్యులు ఎం కె బి శ్రీను, విజయనగరం కార్పొరేషన్ 37 వ డివిజన్ కార్పొరేటర్ కడియాల రామకృష్ణ, తదితరులున్నారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యే కోలగట్లకు అభినందనలు తెలియజేశారు.
previous post