ఈ నెల 14 ఆదివారం హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ధర్మ రక్షా సమితి నిర్వహిస్తున్న భారీ శోభాయాత్ర కు సమస్త హిందూ బంధువులందరూ తరలి రావాలని సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు విజయనగరం దాసన్నపేట లో విజయనగరం ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందివాడ వేణుగోపాల్, శ్యామ్ ,పార్ధశారధి తదితరులు మాట్లాడారు. హిందువులు ఐక్యత చాటి చెప్పేందుకే… ఈ హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా హనుమాన్ జయంతి నేపథ్యంలో భారీ హనుమాన్ విగ్రహం తో ర్యాలీ కొనసాగుతుందన్నారు.నగరంలో మన్నార్ శ్రీ రాజగోపాల్ దేవాలయం నుంచీ ఈ భారీ ర్యాలీ హనుమాన్ విగ్రహం తో ప్రారంభమై…కోట నుంచీ మూడులాంతర్లు, మీదుగా మళ్లీ కోట వరకు కొనసాగుతుఃదని నిర్వాహకులు తెలిపారు.
previous post