పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈ రోజు మహిషాసుర మర్ధినీ దేవి అలంకారంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, చండీ హోమం నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
నిత్యం బంగారు చీర తో దర్శనమిచ్చే మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా వస్తుంటారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని భక్తులను కోరుతున్నారు ఆలయ అధికారులు.
మాస్క్ ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు