హోళీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాలని ఆకాంక్షించారు. సంతోషం, ఔన్నత్యం, ఉల్లాసం, ఆనందాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని శాంతి సౌఖ్యాలు నింపాలని, ఆనందకరమైన, సురక్షితమైన, రంగుల హోలీ జరుపుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారన్నారు. చిన్నపిల్లలు హోలీ ఆడేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రసాయనాలతో కూడిన హానికరమైన రంగులతో కాకుండా సాధారణమైన సహజసిద్ధమైన రంగులు, నీటితోనే అట్టహాసంగా హోలీ పండుగను నిర్వహించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు.
previous post