హైదరాబాద్ నగరంలోని ఓ రహదారి ఉన్నట్టుండి కుంగడంతో అందరూ హడలిపోయారు. సంతోష్ నగర్-సైదాబాద్ రూట్లో ఈ ఘటన జరిగింది. సంతోష్ నగర్ నుంచి ఐఎస్ సదన్ చౌరస్తాకు వెళ్లే రోడ్డులో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు.
అయితే పిల్లర్లు వేసేందుకు రోడ్డు మధ్యలో గుంత తవ్వారు. అయితే ఆ గుంత ఒక్కసారిగా కుంగి మరింత భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో వాహనాలేవీ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. వెంటనే స్పందించిన అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను పక్క నుంచి మళ్లించారు.