ఏలూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాను దీక్ష నిర్మించానని తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు తనకు అండగా నిలిచిన కాపు నాయకులను అరెస్టు చేయడం బాధాకరమని వారందరినీ ఎటువంటి కేసులో లేకుండా విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాపులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముందు ముందు పెద్దలంతా కూర్చొని చర్చించుకుని ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తెస్తే రిజర్వేషన్ సాధించుకుంటామని ఆలోచన చేస్తామని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు.
previous post
next post