35.2 C
Hyderabad
May 29, 2023 20: 46 PM
Slider ప్రత్యేకం

నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

#ycp

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న అధికార వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలు గెలిచిన వైసీపీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన నలుగురిని అనధికారికంగా వైసీపీ తన పార్టీలో చేర్చుకుంది. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో తన సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి ఓటు చేసినట్లు వైసీపీ నిర్ధారించుకుంది. దాంతో ఆ నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసింది. వైసీపీ సస్పెండ్ చేసిన వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటిచంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వైసీపీ నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

Related posts

అత్యవసరాలకు ఆన్ లైన్ ద్వారా లాక్ డౌన్ పాసులు

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఘనంగా రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి

Satyam NEWS

వివేకా హత్యలో సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారు: చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!