ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వారు పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం 6 విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పర్యవేక్షణలో పట్టణంలోని నాలుగో వార్డ్ లో కౌన్సిలర్ ఓరుగంటి రాజ్యలక్ష్మి నాగేశ్వరరావు మొక్కలు నాటారు.
నాటిన మొక్కలకు సపోర్టుగా కర్రలను ఏర్పాట్లు చేసి ఆ స్థలం చుట్టూ పెన్సింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడవలసినదిగా కోరారు. వార్డ్ లో పలుప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, కమిషనర్ నాగిరెడ్డి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మర్ల శ్రీనివాస్ యాదవ్,నర్సింగ్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు D మంగమ్మ వీరారెడ్డి,కుంట ఉపేంద్ర సైదులు,భాస్కర్,యరగాని గురవయ్య ,గాబుల శ్రీను ,కొమ్ము శ్రీను ,సతీష్,ఆంజనేయులు , సంపత్ , వెంకన్న , సత్యనారాయణ , వెంకట రెడ్డి , రాజశేఖర్,మున్సిపాలిటీ సిబ్బంది, ఆర్ పి లు,సి ఆర్ పి లు, మెప్మా సిబ్బంది, వార్డు పౌరులు తదితరులు పాల్గొన్నారు.