కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కార్యకర్త కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ భీమా చెక్కు మంజూరు అయింది. ఈ చెక్కును సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్వయంగా కార్యకర్త ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు అందచేశారు. కాగజ్ నగర్ పట్టణ 10వ వార్డు శ్రీరాం నగర్ కాలనీ చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పాశం గోపాల్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించారు. బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటూ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా ₹ 2,00,000 /- రూపాయల చెక్కును ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మంజూరు చేయించారు. పార్టీ నుండి మంజూరైన చెక్కును సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు స్వయంగా చెక్కును అందజేశారు.
previous post