అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని హత్యరాల క్షేత్రంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి పంచామృత అభిషేకాలు కుంకు మార్చనలు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు వేద పండితులు వేదమంత్రాల నడుమ శాస్త్రవేత్తంగా నిర్వహించారు.అనంతరం ఆలయ నిర్వాహకులు సుబ్బారెడ్డి,విశ్వనాథ రెడ్డి,కొండారెడ్డి ల ఉత్సవ మూర్తులను స్వర్ణా భరణలు,పట్టు వస్త్రాలు, పలు రకాల పుష్పాపాలతో అలంకరించారు.అనంతరం రాజంపేట శాసనసభ్యులు మెడ వెంకట మల్లికార్జున రెడ్డి దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ పురోహితు లు శాస్త్రవేత్తంగా ఎమ్మెల్యేని పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ కళ్యాణ వేదికకు తీసుకువచ్చారు. వేద పండితులు స్వామి వారికి అమ్మవారికి నూతన వస్త్రాల సమర్పించి కళ్యాణ వేడుకను శాస్రోక్తంగా ఘనంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
previous post