30.7 C
Hyderabad
April 29, 2024 05: 45 AM
Slider వరంగల్

ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

#chatrapati

ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు జరిగాయి. చత్రపతి శివాజీ చిత్రపటంతో జాతీయ రహదారిపై శోభాయాత్ర నిర్వహించారు. శివాజీ మహారాజ్ యువజన యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాజీ యువజన యూత్ క్లబ్ సభ్యులతో పాటు హిందూ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. 

రామాలయం ప్రాంగణం నుండి శోభయాత్ర ప్రారంభమై జాతీయ రహదారి నుండి ములుగు పురవీధుల గుండ శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ శోభ యాత్రను ఉద్దేశించి శివాజీ యువజన యూత్ నాయకులు బాణాల వీర సావర్కర్  మాట్లాడుతూ భారతదేశ ఔరత్యం కోసం జాతీయత భావంతో, భారతదేశ హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను,  కాపాడడం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి శివాజీ అని కొనియాడారు. కళింగ సామ్రాజ్యంలో భారతదేశంలో ఒక్కొక్క హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ,  హిందూ హైందవ స్థాపనకు కంకణ బద్ధులై భారతదేశ ఔన్నత్యాన్ని చాటి కంకణ బద్ధులైన వ్యక్తి శివాజీ అని, ఇలాంటి మహానుభావుల జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని యోజన నాయకులు అన్నారు.

హైందవ జీవనమే భారతీయ జీవన విధానం అని చాటిచెప్పిన  శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను మొట్టమొదటిసారిగా  ములుగులో ఘనంగా నిర్వహించారు ఈ శోభయాత్రలు జై శివాజీ జయహో శివాజీ అంటూ నినాదాలు మారుమోగాయి. కాషాయ ధ్వజాలను చేతభూని సుమారు 300 మంది యువజన నాయకులు, హిందూ ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో  శివాజీ యువజన యూత్ కార్యకర్తలు జక్కుల కుమార్,మచ్చిక శ్రావన్ ,మేడుదుల మమన్,కా సరపు రంజిత్ ,మిట్టపల్లి  యశ్వంత్, ఉప్పుల శ్రీ తిన్ ,కొండబోయిన  చందు,చల్ల చరణ్ ,భూక్యా కళ్యాణ్ ,పొరిక జస్వంత్ ,నిర్మల్ చరి ,  హిందూ ప్రజాసంఘాల నాయకులు బాణాల రాజ్ కుమార్  చింతలపూడి భాస్కర్ రెడ్డి నగరపు రమేష్ రా జునాయక్,కృష్ణవేణి, బలరామ్, దింతిరెడ్డి రాకేష్ రెడ్డి ,కొత్త సురేందర్,జినకల కృష్ణకర్ ,నాగరాజు,యద సంపత్, అల్లె శోభన్, గాదంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విదేశీ పర్యటన కు శ్రీకారం చుట్టనున్న బీజేపీ నేత రామ్ చందర్…!

Bhavani

కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంప్  స్వాధీనం

Satyam NEWS

ఆగస్టు 14 వరకు కోర్టులకు లాక్ డౌన్ పొడిగింపు

Satyam NEWS

Leave a Comment