సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నపాటి పేరి రెడ్డి ఈ తరానికి ఆదర్శనీయుడని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కాసు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.
గుంటూరు జిల్లా లింగంగుంట్ల గ్రామంలో స్వర్గీయ పొన్నపాటి పేరి రెడ్డి విగ్రహాన్ని కాసు వెంకట కృష్ణారెడ్డి ఆవిష్కరించారు.
గత తరం విలువలను ఈ తరం వారు గుర్తుంచుకోవాలని, వాటిని పాటించాలని ఈ సందర్భంగా కాసు వెంకట కృష్ణారెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లిఖార్జున రావు, పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి, కపిలవాయి విజయ్ కుమార్ లింగంగుంట్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.