కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు విషయంపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోర్టును కోరారు.
లక్ష్మణ్ వేసిన పిటిషన్కు అర్హత లేదని అందువల్ల ఆ పిటిషన్ను కొట్టివేయాలన్నారు. మంత్రి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.కాగా, 2018లో ధర్మపురి నియోజకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో వనమా వ్యవహారంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంత్రి కొప్పుల హైకోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.