బిచ్కుంద మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడు వందల మాస్కులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పెరుగు కిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఉండాలన్నారు. సామాజిక దూరం పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ప్రధాన కార్యదర్శి పత్తి రమేష్, పస్కే ప్రకాష్, గోనె గంగారాం, దయానంద్, దుబ్బ గంగాధర్, సంతోష్ రెడ్డి, లింగు రామ్, గోనె హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.