తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (TBSSS) నూతన కార్యవర్గం రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మంత్రుల నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసింది.
వరసగా మూడోసారి ఈ కార్యవర్గం ఎంపిక కావడం పట్ల మంత్రి ఆ సంఘం సభ్యులను అభినందించారు.
మంత్రిని కలిసి వారిలో వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ ఆధ్వర్యంలో, గౌరవ సలహాదారు బి హన్మంటాచారి, కార్యదర్శి జి నాగేశ్వర సిద్ధాంతి, మహిళా విభాగం అధ్యక్షురాలు దేవులపల్లి వాణి, రీజనల్ కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు తులసి శ్రీనివాస్, కార్యదర్శి మునిపల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తేరాల వాణి తదితరులు ఉన్నారు.