కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా మరో ఆస్పత్రి అనే శీర్షికన సత్యం న్యూస్ లో కథనం వెలువడిన విషయం తెలిసిందే.
ఈ వార్తకు జిల్లా అధికారులు స్పందించి శుక్రవారం విచారణకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఆసుపత్రి డాక్టర్ ఆస్పత్రిని మూసి వేసి పరారయ్యారు.
దీంతో తను చేస్తున్న వృత్తి ఎంతటి విలువైనదో ఈ ఘటనతోనే స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి అర్హత లేకుండా చికిత్సలు చేస్తున్న డాక్టర్లపై కోరడా ఝుళిపించాలని స్థానికులు కోరుతున్నారు.