బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కు స్వల్ప అస్వస్థత ఏర్పాడింది. ఆయన 11 రోజులుగా మండు టెండలో పాదయాత్ర చేస్తుండటంతో వడదెబ్బ తగిలిందని డాక్టర్లు చెప్పారు. దానితో బాటు ఎసిడిటీ (Acute Gastroenteritis) కూడా వచ్చిందని డాక్టర్లు తెలిపారు.
పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో వైద్యులు చికిత్స అందించారు. పాదయాత్ర కు కొంత విరామం ఇవ్వాలని వైద్యులు సూచించగా అందుకు బండి సంజయ్ ఒప్పుకోలేదు. పాదయాత్ర చేసేందుకే బండి సంజయ్ మొగ్గు చూపుతున్నారు. బండి సంజయ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ శరత్ తెలిపారు.