Slider రంగారెడ్డి

నాన్నా నీకు భారం ఉండొద్దని నా పిల్లలనూ చంపేశా

family

ఆర్ధిక ఇబ్బందులు ఒక కుటుంబం ఉసురు తీశాయి. తీర్చలేని అప్పులు కూడా ఏం కాదు. కేవలం 30, 40 లక్షల రూపాయలు అప్పు ఉండవచ్చు. అంత మాత్రానికే అతని కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. హైదరాబాద్‌ శివారులోని హస్తినాపురం సంతోషిమాత కాలనీలో ఈ పెను విషాదం చోటు చేసుకున్నది.

ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబం మొత్తం విషయం తాగి చనిపోయింది. కలచివేసే ఈ దుర్ఘటనలో మృతులు ప్రదీప్‌(40), భార్య స్వాతి(35), కళ్యాణ్‌ కృష్ణ(6), జయకృష్ణ(2)లు. ప్రదీప్‌ స్వస్థలం దేవరకొండ మండలం నెరడుకొమ్మ గ్రామం. ఇంత కాలం నాకు ఏం తక్కువ కాకుండా పెంచావు నాన్నా, నిన్ను సుఖపెడదామని ఎంతో ప్రయత్నం చేశాను. అయితే విఫలం అయ్యాను.

నా పిల్లలు నీకు భారం అవుతారని వారిని కూడా తీసుకువెళుతున్నాను అంటూ లేఖ రాసిపెట్టి మరీ ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. ఎల్ బి నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మహిళల అక్షర జ్యోతి సావిత్రిబాయి పూలే

Satyam NEWS

దుష్ట చైనా కుట్ర: సరిహద్దుల్లో మళ్ళీ అలజడి!

Bhavani

కడప జిల్లా జడ్పీగిరి కోసం మేడా విజయశేఖర్ రెడ్డి యత్నం

Satyam NEWS

Leave a Comment