ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా నాచారం డివిజన్ నాయి బ్రాహ్మణలు పెద్ద సంఖ్యలో గ్రేటర్ బిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేకర్ ఆధ్వర్యంలో సుమారు 70 మంది నాయి బ్రాహ్మణులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సాయి జన్ శేఖర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ మేము సైతం బండారి లక్ష్మారెడ్డి గెలుపుకై శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సాయి జన్ శేకర్ మాట్లాడుతూ బండారి లక్ష్మారెడ్డిఎమ్మెల్యే కాకముందే పేద ప్రజలకు చేస్తున్న సహాయ సహకారాలు ఆర్థిక సహాయాలు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడుతున్న వారికి ఆదుకుంటున్న ప్రతి ఒక్క విషయం నాయి బ్రాహ్మణులు అందరూ గుర్తించారన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా