సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ వాహనదారులకు హెల్మెట్ ధరించుట, హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గూర్చి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని,మైనర్ లకు,డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి ఎట్టి పరిస్థితిలో వాహనాలు ఇవ్వరాదని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపవద్దని,ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని,డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లయితే వాహనం సీజ్ చేయటం,రైడర్ ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందని ప్రతి ఒక్క వాహనదారుడు తమ తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ ఆఫర్ పీరియడ్ లో క్లియర్ చేసుకోవలని సూచించారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్