విజయనగరం జిల్లా కేంద్రానికి తొలిసారిగా ఒకేసారి ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు వచ్చారు. నగరంలోని జిల్లా కోర్టు లో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి ప్రారంభించారు. ఆయనతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవెంద్రనాథ్ రాయ్, జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి, జస్టిస్ దుప్పల వెంకటరమణ, యు.దుర్గాప్రసాద్ రావు లు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్.పి. దీపిక, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రామ్మోహన్ రావు, కె.వి.ఎన్.తమ్మన్న శెట్టి తదితరులు పాల్గొన్నారు. న్యాయసేవాసదన్ లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు.
previous post
next post