వేగంగా వెళ్తున్న ప్రభుత్వ వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చివ్వేంల మండల పరిధిలోని తిరుమలగిరి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సుజాత హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతున్న సమయంలో వాహనం అదుపుతప్పి పోల్తాపడింది.
రాత్రి సమయం కావడంతో కారు వేగంగా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో న్యాయమూర్తి, సిబ్బందిలను సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మంత్రి జగదీశ్ రెడ్డి వెంటనే స్పందించి తన కాన్వాయ్ ద్వారా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించ్చారు.