తనకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారి లక్ష్మారెడ్డి కి సోమవారం రాచకొండ అడిషనల్ డిసీపి టూ ప్లస్ టూ గన్ మెన్ల ను కేటాయించారు. అయితే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తనకు కేటాయించిన గన్ మెన్ల ను తిప్పి పంపించారు. తనకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని లక్ష్మారెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం రాచకొండ అడిషనల్ డిసీపికి లేఖ రాశారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా