గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కోటప్ప కొండను నేడు ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి నాథ్ తిల్హరి సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా జస్టిస్ రవి నాథ్ తిల్హరి దంపతులకు వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన త్రికోటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రఖ్యాతిగాంచిన త్రికోటేశ్వర దేవస్థానంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణకు ఏర్పాటు పూర్తి కావస్తున్నాయి.
next post