పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఎం పి డి ఓ. జి. రాజ్ మనోజ్ ఈ ఓ పి ఆర్ డి బలరామరాజుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందజేస్తున్న పోషకాహారం, గుడ్లు, పాలు, వైద్యసేవలు, పూర్వప్రాధమిక విద్య, ఆటపాటల వివరాలను అంగన్వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలకు. తల్లులకు ఇస్తున్న టి హెచ్ ఎస్ ఆర్ పై ఆరా తీశారు. పిల్లలకు పరిశుభ్రత లతో బాటు మాస్క్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై పిల్లల్లో అవగాహన కల్పించి మాస్క్ లు ఉపయోగించేలా చూడాలని అంగన్వాడీ కార్యకర్తకు ఆయా కు సూచించారు. ప్రతిరోజూ అంగన్వాడీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎం పి డి ఓ మనోజ్, ఈ ఓ పి ఆర్ డి బలరామరాజు ఆదేశించారు. అంగన్వాడీ కేంద్ర నిర్వహణ, పిల్లల క్రమ శిక్షణ ను చూసి ఎం పి డి ఓ అంగన్వాడీ వర్కర్ పనితీరును అభినందించారు.