35.2 C
Hyderabad
May 1, 2024 00: 05 AM
Slider గుంటూరు

మురికి కూపంలో ఈగలు, దోమలతో పోలీసుల కాపురం

police station

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం లో కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించింది. ముఖ్యంగా పట్టణ పరిధిలోని ఒకటవ, గ్రామీణ పోలీస్ స్టేషన్ ల వద్ద అండర్  డ్రైనేజీ వ్యవస్థ మరి అధ్వాన్నంగా ఉంది. సమస్యల పరిష్కారం కోసం కొందరు, ఫిర్యాదు ఇవ్వటానికి మరి కొందరు నిత్యం స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు.

ఇదంతా ఒక వైపు అయితే నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే రక్షక భటులు ప్రతి రోజు మురికి వాసనా పీల్చ లేక అనారోగ్యం బారిన పడుతున్నారు. పురపాలక శాఖ వారికి సదరు పోలీస్ స్టేషన్ ల సి.ఐ లు అనేక సార్లు చెప్పినప్పటికీ పట్టించు కోవటం లేదు అని కొందరు అంటున్నారు. ఇప్పటికైనా పురపాలక శాఖ అధికారులు  స్పందించి వెంటనే పోలీస్ స్టేషన్ వద్ద గల అండర్ డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయాలని పోలీస్ వారు, అటుగా వచ్చే వారు కోరుకుంటున్నారు.

Related posts

ములుగు జిల్లా లోని రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

Satyam NEWS

కేంద్ర ఏజెన్సీలను విచ్చలవిడిగా వాడుకుంటున్న బిజెపి

Satyam NEWS

ఘనంగా లక్ష్మక్క పల్లె శ్రీ సీతారామ కల్యాణం

Satyam NEWS

Leave a Comment