28.7 C
Hyderabad
April 26, 2024 09: 20 AM
Slider అనంతపురం

ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు సిద్ధం

#NandamuriBlakrishna

అనంతపురం జిల్లా హిందూపురం సమస్యల పరిష్కారానికి అవసరమైతే జగన్‌ను కలుస్తానని శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.  

హిందూపురం విషయంలో ఎంత దూరమైన వెళతానని, దానిని జిల్లాగా ప్రకటించాలని అవసరమైతే సీఎం జగన్‌ను కూడా కలిసి కోరుతానని ఆయన అన్నారు.

నేడు ఆయన హిందూపురం ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రికి 55 లక్షల రూపాయల విలువ చెసే వైద్య పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ  రాష్ట్రంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపులు చర్యలే ఎక్కువ ఉన్నాయన్నారు. రాజధాని లేకున్నా టీడీపీ హయాంలో తెలంగాణ కన్నా అధిక ఆదాయం వచ్చిందన్నారు.

రాష్ట్రంలో అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని బాలకృష్ణ పేర్కొన్నారు. కష్ట కాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. 

Related posts

విజ‌య‌న‌గ‌రం మూడు లాంత‌ర్ల జంక్ష‌న్ నుంచి హెరిటేజ్ వాక్

Satyam NEWS

Analysis: అమెరికాతో భవితవ్యం-భాగస్వామ్యం

Satyam NEWS

కాళేశ్వరం ఆలయంలో కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment