రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రవేశ పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు సోమవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో మొక్కలను నాటారు.
అనంతరం జిల్లాలోని పోలీసు అధికారులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హారతాహరం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేస్తున్నారని అన్నారు.
గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా భవిష్యత్తు తరాల వారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించినవారం అవుతామని అన్నారు.
గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీసు కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. సకాలంలో వర్షాలు కురవాలన్నా, వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని చెప్పారు.