యాదాద్రి భువనగిరి జిల్లా లో దారుణం జరిగింది. పరువు కోసం ఒక మాజీ హోమ్ గార్డు ను దారుణంగా హత్య చేశారు. దీంతో భువనగిరి జిల్లాలో మరో పరువు హత్య నమోదైంది.
రామకృష్ణ గౌడ్ అనే హోంగార్డ్ ను గుండాల ప్రాంతంలో హత్య చేసి సిద్దిపేటలో పడవేసిన వైనం వెలుగులోకి రావడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. గతంలో యాదగిరిగుట్ట లో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న సందర్బంలో భార్గవి అనే ముదిరాజు ల అమ్మాయితో అతనికి ప్రేమ వివాహం జరిగింది.
దాన్ని జీర్ణించుకోలేక పరువుహత్య జరిగినట్లు సమాచారం.అక్రమ చర్యలకు పాల్పడుతున్నాడని ఆరు నెలల క్రితం రిమువల్ ఆఫ్ సర్వీస్ అయిన రామకృష్ణ….ఇప్పుడు శవం అయ్యాడు.