ఓ వైపు రాత్రి పది నుంచీ కర్ఫ్యూ మొదలవుతున్న దరిమిలా… విజయనగరం జిల్లా కలెక్టర్ వద్ద ఆందోళన కొనసాగుతోంది. సంక్షేమ హాస్టళ్లు తెరిపించాలని ఈ ఉదయం నుంచీ ధర్నా చేస్తునే ఉన్నారు. కలెక్టర్ ప్రాంగణంలో పని చేసే అధికారులందరూ ఒక్కొక్కొరూ వెళ్లిపోయారు.
సాయంత్రం, రాత్రి.. అర్ధరాత్రి అవుతున్న ఏ ఒక్క విద్యార్ధి నిరసన చేస్తున్న ప్రాంగణం నుంచీ కదలలేదు. అక్కడే టిఫిన్ లు తెప్పించుకుని కదలకుండా భీష్మించుకుని నిరసన తెలియ చేస్తున్నారు. ఉన్నతాధికారులు అంటే డీఎస్పీ స్థాయి అధికారి నుంచీ ఆదేశాలకై సీఐలు మురళీ ,లక్ష్మణరావు లు నిరీక్షిస్తున్నారు.
ఓ వైపు కరోనా సమయపు అమలవుతున్న పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్లటూన్ సిబ్బంది వచ్చిన మీడియా మొత్తం కవరేజ్ చేస్తుండటంతో కనురెప్ప పాటు లో మీడియా కళ్లు కప్పి విద్యార్థులను అరెస్టు చేసేందుకు సిధ్ధంగా ఉన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్, విజయనగరం