రంగారెడ్డి జిల్లా చందానగర్ లక్ష్మీ విహార్ ఫేజ్ వన్ డిఫెన్స్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్య కు పాల్పడ్డారు. భర్త తో గొడవ కారణంగా అమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమిక సమాచారం. ఐదేళ్ల క్రితం అర్జున్ తో శివానీ వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్య భర్తల మధ్య వివాదాల కారణంగా శివాని భవనంపై నుండి దూకి రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. భర్త అర్జున్ పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.
previous post
next post