తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పుట్టినరోజు ను హైదరాబాద్ అంబర్ పేట లోని గోల్నాకలో ఘనంగా నిర్వహించారు. గోల్నాక డివిజన్లోని ఏకెఎం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులకు దూసరి శ్రీనివాస్ గౌడ్ నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అదే విధంగా అక్కడ మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులతో కలసి కేక్ కటింగ్ చేసి వారికి తినిపించారు. హోం శాఖ మంత్రి జన్మదినం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని దూసరి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, ఏకెఎం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట