28.7 C
Hyderabad
April 28, 2024 04: 40 AM
Slider వరంగల్

వైద్యులకు పీపీఇ కిట్లను అందించిన మంత్రి

Errabelly 201

జనగామ ఏరియా హాస్పిటల్ లో వైద్యులకు పీపీఇ కిట్ల ను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నిర్మూలన, చికిత్స, అందుబాటులో ఉన్న రోగ నిర్ధారణ పరీక్షల పరికరాలు, వైద్య సదుపాయాల పై డాక్టర్లు, సూపరింటెండెంట్ తో మంత్రి సమీక్షించారు.

గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎండీ చెలమశెట్టీ అనిల్ 150 పి పి ఇ కిట్లను స్పాన్సర్ చేశారు. కరోనా వైరస్ నిర్మూలన, చికిత్స లో వైద్యుల సేవలు నిరుపమానమైనవని ఈ సందర్భంగా మంత్ర దయాకర్ రావు అన్నారు. వైద్యుల తమ ప్రాణాలను పణంగా పెట్టిమరి పని చేస్తున్నారని, వారి సేవలను ప్రపంచం మరచిపోదని ఆయన అన్నారు. కరోనా నిర్మూలన జరిగే వరకు పూర్తి లాక్ డౌన్ పాటించాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, జెడ్పీటీసీ లు, కార్పొరేటర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీనివాస్ గౌడ్ కేసులో పోలీస్లపై కోర్టు ఆగ్రహం

Bhavani

విశాఖలో బ్రాహ్మణ అభ్యుదయ సమాజం వనసంతర్పణ

Satyam NEWS

ఓ లింగా. ఓ లింగా నామస్మరణ తో మారుమ్రోగుతున్న పెద్ద గట్టు

Bhavani

Leave a Comment