జనగామ ఏరియా హాస్పిటల్ లో వైద్యులకు పీపీఇ కిట్ల ను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నిర్మూలన, చికిత్స, అందుబాటులో ఉన్న రోగ నిర్ధారణ పరీక్షల పరికరాలు, వైద్య సదుపాయాల పై డాక్టర్లు, సూపరింటెండెంట్ తో మంత్రి సమీక్షించారు.
గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎండీ చెలమశెట్టీ అనిల్ 150 పి పి ఇ కిట్లను స్పాన్సర్ చేశారు. కరోనా వైరస్ నిర్మూలన, చికిత్స లో వైద్యుల సేవలు నిరుపమానమైనవని ఈ సందర్భంగా మంత్ర దయాకర్ రావు అన్నారు. వైద్యుల తమ ప్రాణాలను పణంగా పెట్టిమరి పని చేస్తున్నారని, వారి సేవలను ప్రపంచం మరచిపోదని ఆయన అన్నారు. కరోనా నిర్మూలన జరిగే వరకు పూర్తి లాక్ డౌన్ పాటించాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, జెడ్పీటీసీ లు, కార్పొరేటర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.