యునెస్కో గుర్తింపు వచ్చినా రామప్ప ఏమి అభివృద్ధి జరగడం లేదని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ అన్నారు. నేడు ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ తో కలిసి ఆయన రామప్ప దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ములుగు జిల్లా కోఆర్డినేటర్ ఇరుగు పైడి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు కళ్ల పెళ్లి రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. యునెస్కో గుర్తింపు వచ్చినా రామప్ప అభివృద్ధి చెందడం లేదని ప్రదీప్ గౌడ్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కావాలని ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు. బస్సు డిపో మెడికల్ కళాశాల ఏర్పాటు కావాలని ఆయన కోరారు.
previous post