సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందునా హైదరాబాద్ వాస్తవ్యులు మరచిపోని రోజు. ఆ రోజే తెలంగాణ విమోచన దినోత్సవం… ఈ నెల 17 ఆ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గత రెండు దశాబ్దాల నుంచీ బీజేపీ డిమాండ్ చేస్తునే ఉంది. అయితే తాజాగా అదే రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు.
ఆ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది.. తెలంగాణ బీజేపీ శాఖ.. అలాగే నిర్మల్ లో వెయ్యి ఊడల మర్రి వద్ద సభకు ఏర్పాట్లు చేస్తున్నారు…పార్టీ నేతలు. కాగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని మర్రి చెట్టు వద్ద ఊచకోత కోసారు.. రజాకార్లు. కాలక్రమంలో వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందిందా ప్రసిద్ధ చెందినది.అయితే గత నెల 28 నుంచీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షా పర్యటన రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొననున్నారు.