బీడి కార్మికులందరికి ఇండ్ల స్థలాలు, పెన్షన్ మంజూరి కోసం ఎమ్మెల్యే సహకారం తో ప్రత్యేక కృషి చేస్తానని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల వైస్ ఎంపిపి రాజు పాటిల్ తెలిపారు. బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన బీడి కార్మికుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా సి ఐ టి యు జుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ మాట్లాడుతూ పుల్కల్ గ్రామంలో బీడి లు చేస్తూ జీవితం వెళ్లదీస్తున్న వారికి ఆదుకునేందుకు ప్రత్యేక కృషి చేసిన వైస్ ఎంపిపి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పుల్కల్ గ్దామంతోపాటు మండలం లో గల బీడి కార్మికులందరికి ఇండ్ల స్థలాలు, డబులు బేడ్రూమ్ లను మంజూరు చేయించి వారికి చెదోడు వాదోడు గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లోగ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ గుప్తా, గ్రామపంచాయతీ వార్డ్ సభ్యుడు రాజు, బీడి కార్మికులు విజయలక్ష్మి, రుక్మిణి, లక్ష్మి, గోదమ్మా, పోచమని, భూదేవి తదితరులు పాల్గొన్నారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం