30.7 C
Hyderabad
April 29, 2024 06: 34 AM
Slider మెదక్

రక్తదాన శిబిరాలను కూడా మూర్ఖులు విమర్శిస్తున్నారు

#ministerharishrao

సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్త దాన శిబిరం లో పాల్గొని మంత్రి హరీష్ రావు రక్తదానం చేశారు. కొంత మంది నాయకులు రక్తదాన శిబిరాలను కూడా రాజకీయం చేస్తున్నారని ఈ సందర్భంగా హరీష్ వ్యాఖ్యానించారు. తలేసేమియ వ్యాధిగ్రస్థులకు, గర్భిణీ స్త్రీలకు కొరకు రక్తం సేకరిస్తే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కొంత మంది మూర్ఖుల అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు కాకులను కొట్టి గద్దలకు వేసినట్టున్నది.. పేదలను దోచి పెద్దలకు అందిస్తుంది…అని ఆయన అన్నారు. రైతు సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారం

Satyam NEWS

సుఖ భోగాలకు మార్గం సౌభాగ్యాలకు ద్వారం

Satyam NEWS

కరోనా సోకి కడప ఎన్ టివి రిపోర్టర్ మృతి

Satyam NEWS

Leave a Comment