సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన రక్త దాన శిబిరం లో పాల్గొని మంత్రి హరీష్ రావు రక్తదానం చేశారు. కొంత మంది నాయకులు రక్తదాన శిబిరాలను కూడా రాజకీయం చేస్తున్నారని ఈ సందర్భంగా హరీష్ వ్యాఖ్యానించారు. తలేసేమియ వ్యాధిగ్రస్థులకు, గర్భిణీ స్త్రీలకు కొరకు రక్తం సేకరిస్తే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కొంత మంది మూర్ఖుల అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు కాకులను కొట్టి గద్దలకు వేసినట్టున్నది.. పేదలను దోచి పెద్దలకు అందిస్తుంది…అని ఆయన అన్నారు. రైతు సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post