39.2 C
Hyderabad
April 30, 2024 21: 56 PM
Slider ప్రత్యేకం

బీజేపీ అధికారంలోకి వస్తే ఇళ్లులేని చేనేత కార్మికులందరికీ ఇండ్లు

#bandisainjai

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలియజేసారు. అలాగే చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ కల్పిస్తామని చెప్పారు. ఇల్లులేని పేద చేనేత కార్మికులందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చి తీరుతామన్నారు.

రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలకు… వారు అనుభవిస్తున్న దుర్భర జీవితాలకు ముమ్మాటికీ కేసీఆరే బాధ్యుడని విమర్శించారు. ఎన్నికలొస్తే డబ్బులిస్తే ఓట్లేస్తారనే అహంకారంతో విర్రవీగుతున్న సీఎం కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

చేనేత సహకార ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్, చేనేత రంగ బలోపేతం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా 5వ రోజు ముక్తాపూర్ నుండి పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ దారిపొడువునా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నేతన్నల ఇండ్లలోకి వెళ్లి పరామర్శించారు. వాళ్ల దుస్థితిని కళ్లారా చూశారు. బాధలు స్వయంగా విన్నారు. అనంతరం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోచంపల్లిలో నిర్వహించిన చేనేత కార్మికుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సహా పలువురు నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికి ఉన్నప్పుడు అడుగడుగునా నువ్వు అవమానించినవా లేదా? పరోక్షంగా ఆయన చావుకు కారకుడివి నువ్వేనా కాదా? గుండెమీద చేయి వేసుకుని చెప్పాలని… చేనేత సమాజం… కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టాలన్నారు… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

కేంద్రం బోలెడు నిధులిస్తుంటే.. చేనేత రంగాన్ని గాలికొదిలేసిన కేసీఆర్ ను తరిమితరిమి కొడతామని…. బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

Related posts

మత్స్యకారుల అభివృద్ధి కోసమే చేప పిల్లల పంపిణీ.. మంత్రి పువ్వాడ

Sub Editor

బీజేపీలోకి మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా

Sub Editor

నూతన దర్శకుడు కిరణ్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే’

Bhavani

Leave a Comment