42.2 C
Hyderabad
May 3, 2024 18: 38 PM
Slider ఖమ్మం

అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి

#eligible journalists

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లు , ఇళ్లస్థలాలు ఇవ్వాలని టియూడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాం నారాయణ డిమాండ్ చేశారు . ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన నికరంగా నిలబడే ఐజెయులో ఇటీవల పలువురు సీనియర్ జర్నలిస్టులు చేరారని ,

వారందరికీ స్వాగతం పలుకుతున్నామని పేర్కొన్నారు . సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే జిల్లా కార్యవర్గ విస్త్రత స్థాయి సమావేశంలో సుమారు 150 మంది జర్నలిస్టులు చేరనున్నట్లు తెలిపారు . వారందరికీ స్వాగతం పలుకుతున్నావున్నారు.

సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకూ జర్నలిస్టుల సవుస్యలపై ఐజెయూ పోరాడి పరిష్కరించామని అన్నారు . ఖమ్మంలో ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు కృషి చేసిన మంత్రి పువ్వాడకు ధన్యవాదాలు తెలిపారు . ఇదే విధంగా ఉమ్మడి జిల్లాలోని అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఇప్పటికే ఐజెయూ పోరాడిందని , రాబోయే కాలంలోనూ పోరాడుతుందని తెలిపారు .

అన్ని నియోజకవర్గాల్లోనూ తమ సంఘం ప్రతినిధులు స్థానిక ఎంఎల్‌ఏలను కలిసి వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు . అక్రిడేషన్లు , హెల్త్‌కార్డులు తదితర సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాటంతోనే విలేకర్లకు అందాయున్నారు . ఖమ్మంలో ప్రెస్‌క్లబ్ నిర్మాణం తమ సంఘం కృషి ఫలితంగానే ఏర్పడిందన్నారు . విశాలైమెన ప్రెస్‌క్లబ్ నిర్మాణం కోసం రాబోయే కాలంలో ఐజెయు కృషి చేస్తుందన్నారు .

ఈ నెల 20న హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేుషన్ ఏర్పడిందని , ఈ సందర్భంగా వేసిన కన్వీనింగ్ కమిటీలో మన జిల్లా నుండి సీనియర్ జర్నలిస్టులు ఎన్.వెంకట్రావ్‌కు , ఖదీర్‌కు చోటు లభించిందని పేర్కొన్నారు . రాబోయే కాలంలో పూర్తి కమిటీని వేసేందుకు రాష్ట్ర కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు . జర్నలిస్టుల పట్ల సిఎం కేసీఆర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలను ఖండించారు .

ఈ సందర్భంగా ఐజెయులో చేరిన సీనియర్ జర్నలిస్టులు ఖదీర్ , నాగేందర్‌రెడ్డి , సాగర్ , కెవి , యాకేష్ , సంతోష్ , పెండ్ర అంజయ్యలను అభినందించారు . అనంతరం హిందూ ఫొటోగ్రాఫర్ గోటు నాగేశ్వరరావుకు ఐజెయూ సభ్యత్వమును అందించారు . ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజె(ఐజెయు) జాతీయ కౌన్సిల్ సభ్యులు సామినేని మురారి , రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావ్ , జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు ,

ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాసరావు , కనకం సైదులు , యూనియన్ నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు , కోశాధికారి రాయుల బసవేశ్వరరావు , ప్రెస్‌క్లబ్ కార్యదర్శి కూరాకుల గోపి , కోశాధికారి నామా పురుషోత్తం , జిల్లా నాయుకులు జనార్దనాచారి , వేణు , మధులత , మేడి రవేుష్ , పి. సత్యనారాయణ , కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు .

Related posts

సాగు కు నాగార్జున సాగర్ కుడికాల్వ నీటి విడుదల

Satyam NEWS

బాధితురాలు కోలుకునే వరకూ అన్ని రకాలుగా సహాయం చేస్తాం

Satyam NEWS

తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవడానికి మార్గాలు

Satyam NEWS

Leave a Comment