పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శాశ్వత అన్నదాన ట్రస్ట్ కి నేడు భారీ విరాళం అందింది.
ద్వారకా తిరుమల మండలం దొరసా నిపాడు గ్రామానికి చెందిన నల్లూరి రామకృష్ణ, నాగలక్ష్మి దంపతులు శనివారం నాడు ఒక లక్షా 11 వేల 111 రూపాయలు విరాళం అందచేశారు.
ఈ విరాళాన్ని వారు ఆలయ ఈ ఓ జి వి సుబ్బారెడ్డి కి అందజేశారు. ఈ శాశ్వత అన్నదాన కార్యక్రమం నల్లూరి రామకృష్ణ పేరున జరప నున్నామని ఈ ఓ సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ భారీ విరాళాన్ని స్వామివారి ట్రస్ట్ కి అందజేసిన నల్లూరి రామకృష్ణ దంపతులకు ఈ ఓ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.