తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళుతున్నారనీ కొందరు పనిగట్టుకొని చేయిస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తప్పుడు ప్రచారంపై ఆయన సీరియస్ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ జూపల్లి అంటే గిట్టని వాళ్ల మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని తెలుస్తుంది. ఇది వరకు 2018లో కూడా నియోజకవర్గ ప్రజలకు మాయ మాటలు చెప్పి, ఇలానే మభ్య పెట్టారు.
ఇప్పుడు కూడా జూపల్లి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ మారాల్సిన అవసరం అయితే జూపల్లి కి రాలేదని అనుచరులు అంటున్నారు. అలాంటి పరిస్థితులు వస్తే అనుచరుల, కార్యకర్తల, ప్రజల నిర్ణయం తీసుకున్నాకే జూపల్లి నిర్ణయం ఉంటుందని అనుచర వర్గం భావిస్తుంది.
ఇప్పటికే నియోజకవర్గ పికే సర్వేలో జూపల్లికే అనుకూలంగా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే కేటీఆర్ జూపల్లి ఇంటికి వచ్చారు. మంతనాలు జరిపారని ప్రచారం జరిగింది. ఇప్పటికే బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు జూపల్లిని తమ పార్టీలోకి తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ జూపల్లి నిర్ణయం ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలోనే జూపల్లి కొనసాగుతున్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్