31.2 C
Hyderabad
May 12, 2024 00: 42 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు శఠారి

#TirumalaBalajee

కలియుగ వైకుంఠదైవం వెంకేటేశ్వరస్వామికి ఓ భక్తులు బంగారు శఠారి బహుమతిగా అందించారు. చెన్నైకి చెందిన భాష్యం కన్‌స్ట్రక్షన్స్ సంస్థ తరపున టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు.

ఈ మేరకు కానుకను శ్రీవారి ఆలయంలో టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా పాల్గొన్నారు. శ్రీవారి ఉత్సవాల ఊరేగింపు సందర్భంలో ఈ శఠారిని వినియోగించనున్నారు.

Related posts

న్యూ బిగెనింగ్: ఘనంగా మెట్రో క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

మోటారు వాహనాల చట్టం 2019 రద్దు చేయాలని ధర్నా

Satyam NEWS

దయగల మానవుడి హృదయమే దేవుడి నిలయం

Satyam NEWS

Leave a Comment